Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ లాంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేరు: రోజా

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (19:27 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. దేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లేరన్నారు. మహిళా భద్రత కోసం సిఎం నిరంతరం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
 
ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఒక మహిళపై అత్యాచారం చేసి నిందితులు పారిపోయినా ఇంతవరకు పోలీసులు పట్టుకోకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. బాధితురాలిని పరామర్సించిన టిడిపి నేతలు అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
 
ప్రతిపక్షాల విమర్సలపై తీవ్రస్థాయిలో స్పందించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పించిన విధంగా ఏ ముఖ్యమంత్రి దేశంలో రక్షణ కల్పించడం లేదన్నారు. జగన్ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఘటన జరిగిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు. అసలు ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు.
 
జగన్మోహన్ రెడ్డి డిజిపితో మాట్లాడారని... ఆరు టీంలు ప్రత్యేకంగా వేశారని.. ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించారన్నారు. అంతేకాకుండా బాధితురాలికి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నారని కూడా రోజా చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు రోజా. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం మానుకుంటే బాగుంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments