Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత అన్నను అతికిరాతకంగా పీక కోసి చంపిన తమ్ముడు

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (20:27 IST)
ఆంధ్రా ఊటీ అరకులోయలో దారుణం చోటుచేసుకుంది. సొవ్వ పంచాయతీ దేవుడువలస గ్రామంలో తన స్వంత అన్నను అతి కిరాతకంగా పికకోసి అంతమొందించాడు తమ్ముడు. అన్నాను చంపిన పిదప పోలీసులకు ఎదుట లొంగిపోయాడు నిందితుడు.
 
వివరాల్లోకి వెళ్తే అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీ  దేముడువలస గ్రామంలో గత కొద్ది రోజులుగా వేములవాసుదేవ్, వేముల జగన్నాథం అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి.

తల్లిదండ్రుల నుండి  వాటా చేయాల్సిన భూములను పంచుకొనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ భూమి నాకు కావాలని ఒకరు అడిగితే అదే భూమిని నాకు కావాలని అన్నదమ్ములిద్దరూ రోజు గొడవ పడేవారు.

ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరికి వేముల జగన్నాథం అనే వ్యక్తి తన అన్నయ్య అయిన వేముల వాసుదేవ్( 30)ను పీక కోసి చంపేశాడు, ఆ తర్వాత  నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments