130 కోట్ల భారతీయుల సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది: కేంద్రమంతి పియూష్ గోయల్

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (21:02 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి పియూష్ గోయల్. ఆలయం వద్ద టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని రంగనాయక మండపంలో కేంద్రమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
 
ఆలయం వెలుపల కేంద్రమంత్రి పియూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ 130 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం ఏమిటో ప్రపంచం చూస్తోందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా భావించి 450 దేశాలకు మెడిసిన్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
 
75 దేశాలకు కరోనా వ్యాక్సిన్ భారత్ నుంచి అందించామన్నారు. స్వీయ నియంత్రణ, ఎల్లవేళలా మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ పరిశుభ్రమైన తిరుమలగా అధికారులు తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. 
 
80 శాతం రైల్వే సేవలు ఇప్పటికే ప్రారంభించామని.. త్వరలో పూర్తిస్థాయిలో రైల్వేసేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్లో పలు అభివృద్థి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని... తిరుపతి ఇతర ప్రాంతాల మధ్య అధికంగా రైళ్ళు నడిచేలా అదనపు ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments