Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 12, 13, 14 తేదీల్లో ఉపరాష్ట్రపతి నెల్లూరు రాక

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:43 IST)
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నవంబర్ 12 నుంచి 14 తేదీ వరకు నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వారు నవంబర్ 12వతేదీ సాయంత్రం నెల్లూరులోని వీపీఆర్ ఫంక్షన్ హాలులో లాయర్ పత్రిక తుంగ పండుగ (40 ఏళ్ల ఉత్సవాల్లో)లో పాల్గొంటారు. 
 
అనంతరం రత్నం సంస్థల వ్యవస్థాపకులు రత్నంని పరామర్శించేందుకు వారి ఇంటికి వెళ్తారు. 13వ తేదీ ఉదయం 10 గంటలకు వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్టులో తమ అత్తగారైన శ్రీమతి అల్లూరి కౌసల్యమ్మ స్మారకార్థం ‘కౌసల్యాసదనం’ పేరుతో ఏర్పాటుచేసిన వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభిస్తారు.

13వ తేదీ ఉదయం 11 గంటలకు ముందస్తు అనుమతి పొందిన సందర్శకులను కలుస్తారు. నవంబర్ 14 ఉదయం 10 గంటలకు కేంద్ర గృహమంత్రి అమిత్ షా తో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరుపతికి వెళ్లి అక్కడినుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్తారు.
 
కరోనా నేపథ్యంలో సందర్శకులు పాటించాల్సిన నిబంధనలు:
1. ముందుగానే అనుమతి తీసుకోవాలి
2. మాస్కు తప్పనిసరిగా ధరించాలి
3. ఆరడుగుల దూరాన్ని పాటించాలి
4. వాక్సినేషన్ సర్టిఫికేటును ఫోన్ లో సేకరించి అడిగినప్పుడు చూపించాలి
5. సందర్శన అనుమతికై కింది నెంబర్లను సంప్రదించాలి
కె. విక్రాంత్ – 8130455777
సురేశ్ బాబు జీ - 7042557799
సీహెచ్ జనార్ధనరాజు - 9440425225

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments