Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ గారూ... ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో మీకేది ఇష్టం?

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ మంగళవారం నాడు హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూలును సందర్శించి విద్యార్థులకు తన సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి గవర్నరును... మీకు ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో ఏది ఇష్టం అని ప్రశ

AP
Webdunia
మంగళవారం, 31 జులై 2018 (19:59 IST)
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ మంగళవారం నాడు హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూలును సందర్శించి విద్యార్థులకు తన సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి గవర్నరును... మీకు ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో ఏది ఇష్టం అని ప్రశ్నించాడు. 
 
దీనితో గవర్నర్ నరసింహన్ ఆ విద్యార్థితో... నీకు నీ రెండు కళ్లలో ఏది ఇష్టం అని ప్రశ్నించారు. ఆ విద్యార్థి తనకు రెండు కళ్లూ ఇష్టమే అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు సమాధానం దొరికింది కదా... నాక్కూడా ఏపీ-తెలంగాణ రెండుకళ్లు లాంటివి. నాకు రెండు రాష్ట్రాలు ఇష్టమే అన్నారు. 
 
కాగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇదే పాఠశాలలో 1954-55 మధ్య పాఠశాల విద్యను అభ్యసించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని సంజన అభ్యర్థన మేరకు ఈ ఏడాది గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించి సందేశాన్నివ్వాల్సిందిగా కోరారు. విద్యార్థిని అభ్యర్థనను సమ్మతించిన గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరై తన అమూల్యమైన సందేశాన్నిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments