Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్టిస్ రాకేష్ కుమార్ సేవలు శ్లాఘనీయం: చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (19:52 IST)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తన పదవీ కాలంలో ఎన్నో ఉన్నతమైన తీర్పులు ఇచ్చారని, న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి కొనియాడారు.

జస్టిస్ రాకేష్ కుమార్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టులో నిర్వహించిన పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో జస్టిస్ రాకేష్ కుమార్ కు జ్ఞాపికను అందజేసి, దుశ్శాలువాతో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సత్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్ కుమార్ సేవలను కొనియాడారు. భావితరాలకు ఆయనిచ్చిన తీర్పులు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ అనంతర జీవితం ఆనందమయం కావాలని ఆకాక్షించారు.

క్రీడాకారుడిని కావాలనుకుని న్యాయ వ్యవస్థలోకి వచ్చానని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తెలిపారు. న్యాయమూర్తిగా అందించిన సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. తన పదవీ కాలంలో సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి, న్యాయవాదులకు, తోటి న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అంతకుముందు పదవీ విమరణ చేస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ కు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు అభినందనలు తెలియజేశారు.

చివరగా ‘ఫేర్ వెల్ బై పుషింగ్ ద కార్’ కార్యక్రమంతో జస్టిస్ రాకేష్ కుమార్ కు ఘన వీడ్కోలు పలికారు, ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments