Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పొత్తుదే గెలుపు: పవన్ కల్యాణ్

ఐవీఆర్
ఆదివారం, 17 మార్చి 2024 (19:44 IST)
కర్టెసి-ట్విట్టర్
చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసిపి పాలనను తూర్పారపట్టారు. ఏపీలోని రావణ పాలనను అంతమొందించేందుకే కూటమి ఏర్పాటయ్యిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నుంచి వచ్చిన నరేంద్ర మోదీ పాంచజన్యం పూరించి యుద్ధం ప్రకటిస్తారని అన్నారు. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పొత్తుదే గెలుపు అని అన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఎన్టీఆర్ మరపురాని మనిషి. నటుడిగా రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆయన జీవించారు. ప్రజానాయకుడిగా జీవితాంతం రైతులు, పేదల హక్కుల కోసం పోరాడారు అని అన్నారు.
 
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు వైసిపి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. '' అసమర్థ, అవినీతికర పాలన మూలంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది. ప్రభుత్వ భవనాలు, కాలేజీ భవనాలు సైతం తాకట్టు పెట్టబడ్డాయి. మద్యం ఏరులై పారుతోంది. ప్రజలకు భవిష్యత్తు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని నిలబెట్టడానికే ఈ పొత్తు'' అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments