చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (15:53 IST)
వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసారు పోలీసులు. ఆమధ్య తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి తప్పుడు ప్రచారం చేసారంటూ ఈ కేసు ఆయనపై నమోదైంది. కాగా ఆ బాలిక కొద్దిరోజుల క్రితం ఇంటికి తిరిగిరాలేదు. కంగారుపడ్డ ఆమె తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఆమె రోడ్డు పక్కనే గాయాలపాలై కనిపించింది.
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడికి వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ బాలికపై అత్యాచారం జరిగిందనీ, వారి వివరాలు వెల్లడించారంటూ కేసు ఫైల్ అయ్యింది. ఎలాంటి అఘాయిత్యం జరక్కపోయినా జరిగిందంటూ చెవిరెడ్డి అసత్య ప్రచారం చేసి తమ పరువుప్రతిష్టలకు భంగం కలిగించారంటూ చెవిరెడ్డిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేసారు. దీనితో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments