Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులా? వైసిపి ఏజెంట్లా?: ఎమ్మెల్యే గద్దె రామమోహన్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (19:27 IST)
రాష్ట్రంలో కొంత మంది పోలీసులు వైసిపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ నేడొక ప్రకటనలో విమర్శించారు.

టెక్కలి పట్నంకు చెందిన హరిజన యువకుడు మర్రి జగన్ పై పలాస సిఐ వైసిపి నాయకుల ప్రోద్భలంతో బూట్ కాలితో తన్నడం , చీరాలలో కిరణ్ అనే యువకుడు మాస్క్ వేసుకోలేదని పోలీసులు తల పగులగొట్టి అతని చావుకు కారణమవడం, అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వైసిపి ప్రోద్బలంతో పరప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీసులే శిరోమండనం చేయించడం చూస్తుంటే కొన్ని పోలీసు స్టేషన్లు, వైసిపి కార్యాలయాలుగా పనిచేస్తున్నట్లు కనపడుతున్నాయని ప్రశ్నించారు.

గతంలో రాజమండ్రిలో దళిత బాలికపై అత్యాచారం, నర్సీపట్నం డాక్టర్ విషయంలో లాఠీలతో బాధి, పశువుని కట్టేసినట్లు కట్టిన సందర్భం, దళిత మహిళా డాక్టర్ అనితారాణిని వేధించడం, మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ కుమార్ పై తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ దళితులపై జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తెలియజేస్తుందన్నారు.

ఆదిలోనే దళితులపై జరిగిన దాడిపై ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా దళితుల విషయంలో ప్రభుత్వం వ్యతిరేక వైఖరి విడనాడి దళితులకు ఆత్మ స్తైర్యాన్ని కలిగించాలని, లేనిపక్షంలో దళితులంతా తిరగబడతారని గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments