Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో గంట పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఇంతకీ ఏమైందో తెలుసా?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:51 IST)
విజయవాడలో దట్టమైన పొగ మంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సిన స్పైస్‌ జెట్‌ పొగమంచు కారణంగా రన్‌వే కనబడకపోవడంతో పాటు అధికారుల నుండి ఎలాంటి సిగ్నల్స్‌ రాకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది.

బెంగళూరు నుండి విజయవాడకు వచ్చిన ఆ విమానానికి మంచు కారణంగా ఎటిసి అధికారులు సిగ్నల్స్ ఇవ్వకపోవంతో గంటకు పైగా చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ తర్వాత అప్రమత్తమైన అధికారులు సిగల్‌ ఇవ్వడంతో సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

శంషాబాద్‌ విమానాశ్రయంలో బుల్లెట్లు
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. అమెరికా వెళ్తున్న దంపతుల బ్యాగులో బుల్లెట్లును అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా గురజాలకు చెందిన దంపతులు బుధవారం ఉదయం అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో లగేజీని స్కానింగ్‌ చేస్తుండగా..అధికారులకు బ్యాగుల్లో బుల్లెట్లు లభించాయి. దీంతో ఆ బుల్లెట్లను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆ దంపతులను పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments