Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో గంట పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఇంతకీ ఏమైందో తెలుసా?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:51 IST)
విజయవాడలో దట్టమైన పొగ మంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సిన స్పైస్‌ జెట్‌ పొగమంచు కారణంగా రన్‌వే కనబడకపోవడంతో పాటు అధికారుల నుండి ఎలాంటి సిగ్నల్స్‌ రాకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది.

బెంగళూరు నుండి విజయవాడకు వచ్చిన ఆ విమానానికి మంచు కారణంగా ఎటిసి అధికారులు సిగ్నల్స్ ఇవ్వకపోవంతో గంటకు పైగా చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ తర్వాత అప్రమత్తమైన అధికారులు సిగల్‌ ఇవ్వడంతో సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

శంషాబాద్‌ విమానాశ్రయంలో బుల్లెట్లు
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. అమెరికా వెళ్తున్న దంపతుల బ్యాగులో బుల్లెట్లును అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా గురజాలకు చెందిన దంపతులు బుధవారం ఉదయం అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో లగేజీని స్కానింగ్‌ చేస్తుండగా..అధికారులకు బ్యాగుల్లో బుల్లెట్లు లభించాయి. దీంతో ఆ బుల్లెట్లను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆ దంపతులను పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments