Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన డిజైన్లతో సరికొత్త చేనేత వస్త్రాలు: పుష్ప శ్రీవాణి

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (23:33 IST)
జాతీయ చేనేత ప్రదర్శనలో అమాత్యులు, మహిళా శాసన సభ్యులు సందడి చేసారు. గత రెండు వారాలుగా విజయవాడ నగర వాసులకు దేశంలోని విభిన్న రాష్ట్రాల చేనేత వస్త్రాలను పరిచయం చేస్తున్న ఈ ప్రదర్శన శుక్రవారంతో ముగియనుంది.

 
గురువారం నాటి శాసన సభ సమావేశాల అనంతరం నగరంలోని ఎ ప్లస్ కన్వెన్షన్లో జరుగుతున్న ప్రదర్శనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రంపచోడవరం శాసన సభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి, పాడేరు శాసన సభ్యులు కె.భాగ్యలక్ష్మి తదితరులు అక్కడి వస్త్ర శ్రేణిని చూసి అచ్చెరువొందారు. నూతన డిజైన్లతో సరికొత్తగా ఇక్కడి వస్త్రాలు ఉన్నాయని పుష్ఫ శ్రీవాణి అన్నారు.

 
అందుబాటు ధరలలో ఆధునికత ఉట్టిపడేలా చేనేత వస్త్రాలు లభిస్తున్నాయని తానేటి వనిత పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు ఈ ప్రజాప్రతినిధుల బృందానికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, సంయుక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, ఆప్కో ముఖ్య మార్కెటింగ్ అధికారి లేళ్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments