Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన డిజైన్లతో సరికొత్త చేనేత వస్త్రాలు: పుష్ప శ్రీవాణి

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (23:33 IST)
జాతీయ చేనేత ప్రదర్శనలో అమాత్యులు, మహిళా శాసన సభ్యులు సందడి చేసారు. గత రెండు వారాలుగా విజయవాడ నగర వాసులకు దేశంలోని విభిన్న రాష్ట్రాల చేనేత వస్త్రాలను పరిచయం చేస్తున్న ఈ ప్రదర్శన శుక్రవారంతో ముగియనుంది.

 
గురువారం నాటి శాసన సభ సమావేశాల అనంతరం నగరంలోని ఎ ప్లస్ కన్వెన్షన్లో జరుగుతున్న ప్రదర్శనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రంపచోడవరం శాసన సభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి, పాడేరు శాసన సభ్యులు కె.భాగ్యలక్ష్మి తదితరులు అక్కడి వస్త్ర శ్రేణిని చూసి అచ్చెరువొందారు. నూతన డిజైన్లతో సరికొత్తగా ఇక్కడి వస్త్రాలు ఉన్నాయని పుష్ఫ శ్రీవాణి అన్నారు.

 
అందుబాటు ధరలలో ఆధునికత ఉట్టిపడేలా చేనేత వస్త్రాలు లభిస్తున్నాయని తానేటి వనిత పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు ఈ ప్రజాప్రతినిధుల బృందానికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, సంయుక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, ఆప్కో ముఖ్య మార్కెటింగ్ అధికారి లేళ్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments