Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మృతుల పట్ల ప్రభుత్వ వైఖరి అమానుషం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (11:55 IST)
కరోనా మృతుల పట్ల జగన్ ప్రభుత్వ వైఖరి అమానుషంగా వుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

"‌రాష్ర్టంలో కరోనా మృతులపట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషం. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనాతో చనిపోయిన వ్యక్తిని ప్రొక్లెన్‌ తో ఈడ్చుకెళ్లిన ఘటన మానవ సంబందాలకు, సాంప్రదాయాలకు మాయనిమచ్చ. 

కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాల్సిన ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరించటం సిగ్గుచేటు. ఐసోలేషన్ వార్లుల్లో, క్యారంటైన్ కేంద్రాల్లో రోగులకు, డాక్టర్లకు, నర్సులకు కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన వారిని వేదించటంపైన జగన్ పెట్టిన శ్రద్ద కరోనా నివారణపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కరోనా నివారణకు రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రం రూ.8 వేల కోట్లిచ్చిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా చెప్పారు. మరి రూ.8 వేల కోట్లు నిధులు ఏమయ్యాయి?

వాటిని సక్రమంగా ప్రజల కోసం వినియోగించి వుంటే పలాసలో ఈ ఘటన జరిగి ఉందేది కాదు. ఇక ముందు పలాసలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించిన వారిని వేదించటం మాని కరోనా రోగులకు, విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు కనీసం సౌకర్యాలు కల్పించాలి" అని ప్రకటనలో డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments