Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మృతుల పట్ల ప్రభుత్వ వైఖరి అమానుషం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

government attitude
Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (11:55 IST)
కరోనా మృతుల పట్ల జగన్ ప్రభుత్వ వైఖరి అమానుషంగా వుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

"‌రాష్ర్టంలో కరోనా మృతులపట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషం. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనాతో చనిపోయిన వ్యక్తిని ప్రొక్లెన్‌ తో ఈడ్చుకెళ్లిన ఘటన మానవ సంబందాలకు, సాంప్రదాయాలకు మాయనిమచ్చ. 

కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాల్సిన ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరించటం సిగ్గుచేటు. ఐసోలేషన్ వార్లుల్లో, క్యారంటైన్ కేంద్రాల్లో రోగులకు, డాక్టర్లకు, నర్సులకు కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన వారిని వేదించటంపైన జగన్ పెట్టిన శ్రద్ద కరోనా నివారణపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కరోనా నివారణకు రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రం రూ.8 వేల కోట్లిచ్చిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా చెప్పారు. మరి రూ.8 వేల కోట్లు నిధులు ఏమయ్యాయి?

వాటిని సక్రమంగా ప్రజల కోసం వినియోగించి వుంటే పలాసలో ఈ ఘటన జరిగి ఉందేది కాదు. ఇక ముందు పలాసలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించిన వారిని వేదించటం మాని కరోనా రోగులకు, విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు కనీసం సౌకర్యాలు కల్పించాలి" అని ప్రకటనలో డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments