Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యోపాపం.. తండ్రీ, కూతుళ్ళు వరద నీటిలో కొట్టుకుపోయారు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:12 IST)
పెళ్ళికి వెళ్ళి వస్తూ కారులో సందడి చేస్తూ కూర్చుని ఉంది ఓ కుటుంబం. ఉన్నట్లుండి వరద నీటిలోకి కారు వెళ్ళిపోయింది. దీంతో వారు కొట్టుకుపోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడితే మరో ఇద్దరు గల్లంతయ్యారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. 
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వడ్డిపల్లికి చెందిన ప్రతాప్ తన భార్య, కుమార్తె అనితతో పాటు బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు చిత్తూరుకు వెళ్ళారు. నిన్న సాయంత్రం రిసెప్షన్ చూసుకుని ఇంటికి కారులో పయనమయ్యారు. 
 
డ్రైవర్ కారును నడుపుతూ పెనుమూరు మండలం కొండయ్యగారి వంక వద్దకు వచ్చాడు. రాత్రి వేళ కావడంతో నీటి ప్రవాహం డ్రైవర్‌కు కనిపించలేదు. అందులోను నిద్రమత్తులో ఉన్నాడు. ఎప్పటిలాగే కారును వాగులో దించాడు. దీంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. 
 
కారు వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్, ప్రతాప్ భార్య ఎలాగోలా వరదనీటి నుంచి తప్పించుకున్నారు. కానీ ప్రతాప్, ఆయన కుమార్తె అనిత మాత్రం గల్లంతయ్యారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు బోరున విలపిస్తూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments