Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యోపాపం.. తండ్రీ, కూతుళ్ళు వరద నీటిలో కొట్టుకుపోయారు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:12 IST)
పెళ్ళికి వెళ్ళి వస్తూ కారులో సందడి చేస్తూ కూర్చుని ఉంది ఓ కుటుంబం. ఉన్నట్లుండి వరద నీటిలోకి కారు వెళ్ళిపోయింది. దీంతో వారు కొట్టుకుపోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడితే మరో ఇద్దరు గల్లంతయ్యారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. 
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వడ్డిపల్లికి చెందిన ప్రతాప్ తన భార్య, కుమార్తె అనితతో పాటు బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు చిత్తూరుకు వెళ్ళారు. నిన్న సాయంత్రం రిసెప్షన్ చూసుకుని ఇంటికి కారులో పయనమయ్యారు. 
 
డ్రైవర్ కారును నడుపుతూ పెనుమూరు మండలం కొండయ్యగారి వంక వద్దకు వచ్చాడు. రాత్రి వేళ కావడంతో నీటి ప్రవాహం డ్రైవర్‌కు కనిపించలేదు. అందులోను నిద్రమత్తులో ఉన్నాడు. ఎప్పటిలాగే కారును వాగులో దించాడు. దీంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. 
 
కారు వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్, ప్రతాప్ భార్య ఎలాగోలా వరదనీటి నుంచి తప్పించుకున్నారు. కానీ ప్రతాప్, ఆయన కుమార్తె అనిత మాత్రం గల్లంతయ్యారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు బోరున విలపిస్తూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments