Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలను బలితీసుకున్న విద్యుత్ తీగలు.. బట్టలు ఉతుకుతూ..?

Webdunia
మంగళవారం, 3 మే 2022 (19:46 IST)
భార్యాభర్తలను విద్యుత్ తీగలు బలి తీసుకున్నాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అర‌కు లోయ‌లో చోటుచేసుకుంది. క్షణాల వ్యవధిలో దంపతులు విద్యుతాఘాతానికి బలైపోవడం.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. 
 
వివ‌రాల్లోకి వెళ్తే.. అర‌కు లోయ‌లోని విద్యుత్ ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌లో ఓ ఇద్ద‌రు దంప‌తులు నివాస‌ముంటున్నారు. భార్య బ‌ట్ట‌లు ఉతుకుతుండ‌గా, వాటిని భ‌ర్త ఆరేస్తున్నాడు.
 
విద్యుత్ స‌ర్వీస్ వైర్‌పై భ‌ర్త బ‌ట్ట‌లు ఆరేస్తున్న క్ర‌మంలో విద్యుత్ షాక్‌కు గుర‌య్యాడు. దీంతో అప్రమత్తమై భార్య భర్తను కాపాడబోయి.. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇద్ద‌రూ స్పృహ కోల్పోయారు. 
 
వీరిద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు స‌మాచారం అందించారు. కానీ ఆంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ఇంటి వద్దే ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments