Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ పర్యటనకు వెళ్లాలనివుంది.. అనుమతి ఇవ్వండి : కోర్టులో జగన్ పిటిషన్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (12:22 IST)
తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సివుందని, అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన ఒక పిటిషన్‌ను దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది. ఇక్కడ విషయమేమిటంటే.. సీఎం జగన్‌తో ఆయన వ్యక్తిగత ఆడిటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమితి ఇవ్వాలని కోరడం గమనార్హం. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
 
కాగా, సెప్టెంబర్ 2వ తేదీన లండన్‌లోని తన కూతురును చూసేందుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని, ఇందుకు దేశం విడిచి వెళ్లరాదన్న తన బెయిల్ షరతులను సడలించాలని జగన్ తన పిటిషన్ కోరారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు విచారణను బుధవారం వాయిదా వేసింది. ఈ రోజు సీబీఐ వాదనలు వినిపించింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని కోర్టుకు విన్నవించింది. వాదనల అనంతరం విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది.
 
మరోవైపు యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, ఈ రోజు వాదనలు ముగిశాయి. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ... కోర్టును కోరింది. ఈ రోజు వాదనలు ముగియడంతో న్యాయస్థానం తన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments