Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సాగర్‌ను పేల్చేస్తాం... టెర్రరిస్టుల వార్నింగ్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (17:20 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందిస్తూ వస్తున్న నాగార్జన సాగర్ డ్యామ్‌ను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్‌ను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారనీ, అందువల్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. 
 
నాగార్జున సాగర్‌తో పాటు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంది. తెలంగాణలోని ఈ రెండు ప్రదేశాల్లో దాడులు జరగొచ్చని ఐబీ తెలిపింది. వీటితో పాటు ఢిల్లీ సహా 20 రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ పేర్కొంది. 
 
నేపాల్‌లో ఉగ్రదాడి తర్వాత సముద్ర మార్గం నుంచి భారత్‌కు కొందరు ఉగ్రవాదులు వచ్చారని.. మన దేశంలో దాడులు జరిపేందుకు వీరు సిద్ధమయ్యారని.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వీరు గురిపెట్టినట్లు అప్పట్లో ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
 
మరోవైపు ఐబీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే గతంలోనూ నాగార్జనుసాగర్‌కు పలుమార్లు ఉగ్ర హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments