Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మారణహోమానికి కుట్ర... విస్తృతంగా తనిఖీలు

హైదరాబాద్ నగరంలో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు నగరంలోని కీలక ప్రాంతాల్లో విస్త

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (09:51 IST)
హైదరాబాద్ నగరంలో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు నగరంలోని కీలక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా షాపింగ్‌మాల్స్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో దాడులు జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. 
 
అలాగే హైదరాబాద్‌, సైబరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలపై కూడా నిఘా వేసి ఉంచాలని కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం మాదాపూర్‌లోగల ఇనార్బిట్ మాల్‌లో పోలీసుల పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. బాంబు‌, డాగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 
లోపలికి వెళ్లే ప్రతీ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మాల్‌లోకి పంపిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్ర హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నగరంలోని షాపింగ్ మాల్స్ అన్నింటిని పోలీసులు అప్రమత్తం చేశారు. ఒకరకంగా నగరమంతా హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. 
 
వారాతం కావడంతో ఐటీ కారిడార్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఉగ్రవాదులు మాదాపూర్ మాల్స్‌ను టార్గెట్ చేశారని తెలుస్తోంది. రంజాన్ మాసంలో ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐటీ కారిడార్ అడుగడుగునా పోలీస్ తనిఖీలు కొనసాగుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments