Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్షన్ టెన్షన్.. కుప్పంలో రఘువీరను అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు...

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (17:08 IST)
ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని నిలిపేశారు. ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన సంఘటన వివరిలిలా ఉన్నాయి. 
 
కుప్పం నియోజకవర్గంలోని శాంతీపురం మండలంలో ఏడో మైలు వద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం భూ సేకరణ చేస్తోంది. ఇందులో భాగంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. వారితో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సోమవారం మధ్యాహ్నం బయలుదేరారు. రఘువీరారెడ్డి కుప్పం మండలం లక్ష్మీపురం వద్దకు చేరుకోగానే తెదేపా శ్రేణులు ఆయను అడ్డుకున్నాయి.
 
వెళ్లడానికి వీల్లేందంటూ ఆయన వాహనాలకు అడ్డు నిలబడ్డారు. ఈ సందర్భంగా తెదేపా, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విమానాశ్రయ భూముల రైతులను కలిసి విమానాశ్రయ ఏర్పాటుకు ఎందుకు అడ్డంపడుతున్నారని తెలుగుదేశం కార్యకర్తలు రఘువీరను నిలదీశారు. ఈ సందర్భంగా మరోమారు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో బందోబస్తు నడుమ రఘువీరారెడ్డిని అక్కడి నుంచి పంపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

Show comments