Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో ఇద్దరికి కరోనా.. ఆ వైద్యుడి సంగతేంటి?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (09:50 IST)
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రెండు కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ రెండు కూడా నిత్యం వందలాది మంది రోగులకు వైద్యం చేసే ఒక డాక్టరు భార్య, ఆయన కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు, వైద్యుడికి మాత్రం కరోనా టెస్టులో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆయన వద్దకు వచ్చే రోగులంతా ఊపరి పీల్చుకున్నారు. మొత్తం 109 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ కరోనా నెగెటివ్ అని తేలడంతో అంతా తేలికపడ్డారు. 
 
మూడు రోజులుగా శ్రీకాళహస్తి ప్రజలకు, వైద్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దీనికి కారణం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడుకి కరోనా వైరస్ సోకినట్టు ప్రచారం జరగడమే. ఆ వైద్యుడి వద్దకు నిత్యం రోగులు అనేక మంది వస్తుంటారు. టోకెన్ విధాం లేదు. కన్సెల్టెన్సీ ఫీజు లేదు. కేవలం మందులు, ఇంజెక్షన్లకు మాత్రమే డబ్బులు తీసుకుంటారు. దీంతో శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రోగులు కూడా ఆయన వద్దకు వచ్చి వైద్యం చేయించుకుంటారు. 
 
అయితే, గత నెల 30వ తేదీన ఓ వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఆ వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందాడు. రెండు రోజుల తర్వాత ఆ వ్యక్తికి కరోనా అనుమానితుడుగా భావించి క్వారంటైన్‌కు తరలించారు. కానీ, నాలుగు రోజుల క్రితం వైద్యుడి భార్యకు, కుమార్తెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో వైద్యుడు కూడా స్వచ్చంధంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని తేలడంతో ఆయన వద్ద చికిత్స కోసం వచ్చిన వారితోపాటు వైద్యులు కూడా తేలికపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments