Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసులో చిక్కుముడి వీడినట్టేనా?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:49 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు సునీల్ యాదవ్‌కు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. 
 
సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సునీల్‌ను గోవాలో అరెస్ట్ చేయగా, ఈ నెల 4 నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ కుమార్ తీరు అనుమానాస్పదంగా ఉన్నట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.  
 
మరోవైపు, ఈ కేసులో మరికొంతమంది వద్ద సీబీఐ విచారణ జరిపింది. ఇపుడు సునీల్‌ను తమ కష్టడీకి తీసుకుని విచారించిన తర్వాత మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments