Webdunia - Bharat's app for daily news and videos

Install App

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (10:18 IST)
తెలుగు భాషకు మరింత గౌరవం రావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులైన జీవోలు తెలుగులోనూ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మొట్టమొదటి తెలుగు జీవో విడుదల కాగా, ఈ నిర్ణయంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలుగు భాషపై మరింత ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వివాదాస్పదంగా మారింది. ఇది తెలుగు భాష భవిష్యత్తుపై ప్రాముఖ్యత కోల్పోయేలా చేస్తుందని అప్పట్లో అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఏపీ సర్కారు తొలిసారిగా తెలుగులో జీవో విడుదల చేయడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో జీవోలు రావడంతో ప్రజలకు అవగాహన పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రభుత్వం ప్రతి జీవోని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని నిర్ణయించింది. 
 
ప్రస్తుతం ప్రభుత్వం ఒక జీవోను ఇంగ్లీషులో విడుదల చేసిన రెండు రోజులకు తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వ పనితీరు పైన ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments