Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఎమ్మెల్యేలు.. ఎంపీలకు చంద్రబాబు పదవులు ఇవ్వనన్నారు... ఎంపీ మురళీమోహన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడ

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నాలుగు హితవచనాలు చెప్పి పంపారు. పొద్దస్తమానం పదవులపై ధ్యాసేనా.. రాష్ట్రాభివృద్ధిపై కాస్తైనా మనస్సు పెట్టండంటూ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని మురళీమోహనే స్వయంగా వెల్లడించారు. అడిగిన వారందరికీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టలేనని చంద్రబాబు అన్నారని చెప్పారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలకూ పదవులు ఇవ్వదలచుకోలేదని సీఎం స్పష్టంగా చెప్పారని తెలిపారు. 
 
అయితే, తితిదే ఛైర్మన్ కుర్చీపై ఆశపడటానికి ఓ కారణం ఉందన్నారు. తనకు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ.. చిన్ననాటి నుంచి టీటీడీ చైర్మన్ పదవి చేయాలని కోరిక ఉందని, అందుకే తన మనస్సులోని మాటను చంద్రబాబుకు చెప్పానని సినీ నటుడు వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments