Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఎన్యుమరేటర్‌ను బూతులు తిట్టడమే కాకుండా?

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (15:40 IST)
మహిళా ఎన్యుమరేటర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నేతపై కేసు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా బోరబండలోని ఆదిత్యానగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 
 
సోమవారంనాడు ప్రీ సర్వే నిర్వహించడానికి వచ్చిన మహిళా అధికారితో రాజు నాయుడు అనే టిడిపి నేత వాదనకు దిగడమే కాకుండా ఆమెను బూతులు తిట్టాడని, ఆమె ప్రైవేట్ భాగాలను తాకాడని ఆరోపణలు వచ్చాయి. 
 
అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బి ఫార్మసీ విద్యార్థిని ప్రీ సర్వేలో భాగంగా ఇళ్లకు స్టిక్కర్లు అతికించడం, సర్వే ఫారాలను పంపిణీ చేయడం వంటి పనులు చేస్తూ ఉండగా రాజు నాయుడు గొడవకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
సుల్తానా అనే ఆ మహిళా ఎన్యుమరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజు నాయుడిపై కేసు నమోదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు