Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్ ఖాకీని చెప్పుతో కొట్టిన తెరాస మహిళా నేత

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్‌ని చెప్పుతో కొట్టింది తెరాస మహిళా నేత. సిర్పూర్ కాగజ్ నగర్ ఫారెస్ట్ అధికారిపై దాడి సంఘటన మరువకముందే మల్కాజిగిరిలో మరో అధికారిపై తెరాస నాయకురాలు దాడికి పాల్పడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తున్నారని ఫోటో తీసినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని చెప్పుతో కొట్టింది. 

మల్కాజిగిరి మౌలాలికి కమాన్ వద్ద ముజఫర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్నాడు. గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ముజఫర్ ఫోటో తీశాడు. అది గమనించిన గౌస్ కానిస్టేబుల్‌ని బెదిరించి వెళ్లాడు. 15 నిమిషాల తర్వాత మరో నలుగురు వచ్చి కానిస్టేబుల్ ముజఫర్‌పై మౌలాలికి చెందిన టి.ఆర్.ఎస్ నాయకురాలు దాడి చేశారు.

ఆమె పేరు సయ్యద్ మహమ్ముదా బేగం. ఆమె కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టింది. ఆ తర్వాత ఆమె వెంట వచ్చినవారితో పాటు కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారు. కానిస్టేబుల్ వద్ద ఉన్న కెమెరా కూడా లాక్కున్నారు. తనపై జరిగిన దాడిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ముజఫర్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన ఐదుగురిపై ఐపీసీ 332, 382, 506 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి మల్కాజిగిరి పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments