స్థానిక సంస్థలకు జరుగుతున్న పరోక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలకు జడ్పీ ఛైర్మన్ల అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైంది. మహబూబ్నగర్, వరంగల్, జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ఆసక్తికరంగా మారాయి. అయితే రంగారెడ్డి జిల్లాలో నలుగురు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడనుంది. మధ్యాహ్నం 3.00 గంటలకు జడ్పీ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల ఎన్నిక జరగుతుంది.