Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ రద్దు చేయాలంటూ 'ఆర్ఆర్ఆర్' పిటిషన్ - సీఎం జగన్‌కు కోర్టు నోటీసు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌పై 11 చార్జిషీటులు ఉన్నాయని, ఆయన బయట వుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందువల్ల తక్షణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఏపీ సీఎం జగన్‌కు నోటీసు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదావేసింది. 
 
నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని రకాల కేసులను త్వరితగతిన విచారించి ముగించాల్సివుంది. అందువల్ల జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని చార్జిషీట్లపై విచారణ జరిపించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ నేపథ్యంలో జగన్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదావేసింది. ఈ నోటీసులకు జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, జగన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో రఘురామ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments