బెయిల్ రద్దు చేయాలంటూ 'ఆర్ఆర్ఆర్' పిటిషన్ - సీఎం జగన్‌కు కోర్టు నోటీసు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌పై 11 చార్జిషీటులు ఉన్నాయని, ఆయన బయట వుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందువల్ల తక్షణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఏపీ సీఎం జగన్‌కు నోటీసు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదావేసింది. 
 
నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని రకాల కేసులను త్వరితగతిన విచారించి ముగించాల్సివుంది. అందువల్ల జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని చార్జిషీట్లపై విచారణ జరిపించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ నేపథ్యంలో జగన్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదావేసింది. ఈ నోటీసులకు జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, జగన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో రఘురామ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments