Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:41 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 
 
వేసవి మొదలు కాకముందే.. ప్రతి రోజు 40 నుంచి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో జనాలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే.. జంకుతున్నారు. కాగా బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
 
అత్యధికంగా నల్గొండ జిల్లాలో 42.4 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు అయింది. కాగా వచ్చే మూడు రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్‌ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments