Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో తెరాస మంత్రులు ఉన్నారా? అయితే వదిలిపెట్టొద్దు : కేసీఆర్

హైదరాబాద్ వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో పలువురు తెరాస మంత్రులు, నేతలతో పాటు వారి కుమారులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు.

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (15:28 IST)
హైదరాబాద్ వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో పలువురు తెరాస మంత్రులు, నేతలతో పాటు వారి కుమారులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. 'డ్రగ్స్' కేసు వ్యవహారంలో టీఆర్ఎస్ నాయకులైనా, మంత్రులైనా సరే ఉంటే వదిలిపెట్టవద్దని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించవద్దని చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 
 
ఇటీవలికాలంలో హైదరాబాద్ నగరం డ్రగ్స్‌ కేంద్రంగా మారిపోయింది. దీనికి సంబంధించిన డ్రగ్స్ దందా కూడా తాజాగా వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, పోలీసు అధికారులతో సీఎం కేసీఆర్ ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 3గంటలపాటు జరిగిన ఈ భేటీలో డ్రగ్స్ రాకెట్‌పై సుదీర్ఘంగా చర్చించారు. 
 
ముఖ్యంగా డ్రగ్స్ కేసు దర్యాప్తులో దూకుడు పెంచాలని, అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులకు కనున ఈ వ్యవహారంతో సంబంధాలు ఉంటే  తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.. హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకం, దందా ఎప్పటి నుంచో ఉన్నాయని, దీనిని పూర్తిగా రూపుమాపేందుకు అధికారులు కృషి చేయాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని, ఈ నగరం బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని కేసీఆర్ సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments