Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పాఠశాలలకు ఉపాధ్యాయులు కావలెను...!

తిరుమల తిరుపతి మొత్తాన్ని ప్రక్షాళన చేసి అధికార యంత్రాంగాన్ని పరుగులెత్తిస్తున్న తితిదే ఈఓ సాంబశివరావు దేవస్థానం విద్యాశాఖపైన అవసరమైనంత దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్‌ ద

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (13:41 IST)
తిరుమల తిరుపతి మొత్తాన్ని ప్రక్షాళన చేసి అధికార యంత్రాంగాన్ని పరుగులెత్తిస్తున్న తితిదే ఈఓ సాంబశివరావు దేవస్థానం విద్యాశాఖపైన అవసరమైనంత దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్‌ దీనావస్థను గమనించాకే ఇలాంటి అభిప్రాయం అందరికీ కలుగుతోంది. ఈ పాఠశాల దుస్థితి ఈఓ దృష్టికి వెళ్ళిందో లేదో గానీ సమస్య మాత్రం చాలా తీవ్రమైనదే. ఇంతకీ విషయం ఏమిటంటే.
 
తిరుమలలోని ఎస్వీ హైస్కూల్‌లో ప్రాథమిక తరగతులకు అంటే ఒకటి నుంచి ఐదో తరగతి దాకా బోధించడానికి చాలినంత మంది ఉపాధ్యాయులు లేరు. ఈ తరగతుల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియాల్లో కలిపి 200 మంది విద్యార్థులున్నారు. అయితే ఉపాధ్యాయులు నలుగురు మాత్రమే ఉన్నారు. నలుగురు ఉపాధ్యాయులు 200 మందికి, అదీ రెండు మీడియాల్లో బోధించడం ఇబ్బందిగా ఉంది. ఒక్కరోజు ఎవరైనా సెలవు పెడితే ముగ్గురు అవుతారు ఇద్దరు సెలవు పెడితే 200 మందికి ఇద్దరు ఉపాధ్యాయులే ఉంటారు. వీరితో చదువులు ఎలా సాగుతాయో అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం 200 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది.
 
తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నిసార్లు తితిదే ఉన్నతాధికారులను వేడుకున్నా ప్రయోజనం లేదు. అయినా స్థానికులకు ఇక్కడే చదువుకోక తప్పడం లేదు. ప్రాథమిక విద్యను అభ్యసించే చిన్నారులు రోజూ తిరుపతికి వెళ్ళి రావడం అసాధ్యం. అందుకే అరకొర చదువులైనా ఎస్వీ హైస్కూల్‌లోనే చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
 
తితిదే విద్యాసంస్థలపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ సంస్థల్లో నాణ్యమైన విద్య లభిస్తోందన్న నమ్మకమూ ప్రజల్లో ఉంది. అలాంటిది కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల తితిదే విద్యాసంస్థలకే చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉండే పాఠశాలలోనే ఉపాధ్యాయుల కొరత ఇంత తీవ్రంగా ఉంటే ఇక మిగిలిన పాఠశాలలు ఎలా ఉన్నాయో అనే అనుమానం కలుగుతోంది. ప్రతి చిన్ని విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించే ఈఓ తిరుమల ఎస్వీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరత సమస్యనూ పట్టించుకోవాలని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని తిరుమల వాసులు కోరుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments