Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి బుద్ధులు చెప్పాల్సిన టీచర్లే తన్నుకున్నారు.. గొడవకు ఎవరు బ్రేకేశారో తెలుసా?

విద్యార్థులకు మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే నువ్వా నేనా అంటూ జగడానికి దిగారు. అదీ విద్యార్థుల ముందే టీటర్లు కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (15:16 IST)
విద్యార్థులకు మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే నువ్వా నేనా అంటూ జగడానికి దిగారు. అదీ విద్యార్థుల ముందే టీటర్లు కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదంతా కడప జిల్లాలోని సుండుపలి మండలం రెడ్డివారి పల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి. టీచర్లు రెండు వర్గాలుగా విడిపోయి.. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. విద్యార్థుల ముందే వాదులాటకు దిగేవారు. 
 
అది కాస్త శ్రుతిమించింది. బుధవారం స్కూలుకొచ్చిన టీచర్లు చిన్న విషయమై వాగ్వాదం చేసుకున్నారు. దీంతో ఒక వర్గం వారు ఇన్ ఛార్జ్ హెడ్ మాస్టర్ కదిరి నాయకల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ జగడం కాస్త తన్నుకునేంత వరకు పోయింది. అరుపులు, కొట్లాటలు చూసి భయపడిన విద్యార్థులు పరుగున వెళ్లి స్థానికులకు విషయం చేరవేశారు. దీంతో స్థానికులు రంగంలోకి దిగి ఉపాధ్యాయుల గొడవకు బ్రేక్ వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments