Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కార్యకర్తను పరుగెత్తించి కత్తులతో నరికి చంపారు...

Webdunia
బుధవారం, 29 మే 2019 (12:25 IST)
నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. ఈ నెల 23వ తేదీన వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నవ్యాంధ్రలో అధికార తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోగా, వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ మరుసటిరోజు నుంచే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ఇళ్ళను, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. గత వారం రోజుల్లోనే నలుగురైదుగురు టీడీపీ కార్యకర్తలు హత్యలకు గురికాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమలూరులో మంగళవారం రాత్రి టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఆయన్ను పరుగెత్తించి, పరుగెత్తించి కత్తులతో నరికి చంపారు. ఆయన తన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ఈ హత్య జరిగింది. ఆ తర్వాత దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
బుధవారం ఉదయం రోడ్డుపక్కన పడివున్న శ్రీనివాసులు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్త హత్యతో మడమలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments