Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై రాళ్లదాడి చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనుచరులు

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (09:41 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన రోడ్‌షో‌లో కొందరు అగంతకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డాడు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరో టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. రాళ్లదాడి చేసింది వైకాపా ఎమ్మెల్సీ అరుణ ప్రధాన అనుచరులైన పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్‌లు గుర్తించారు. వారికి సంబంధించిన ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. రాళ్లు విసురుతున్న నిందితుల ఫోటోలను విడుదల చేసింది. 
 
తాజాగా ఈ దాడికి పాల్పడినవారు వైకాపాకు చెందినవారేనంటూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడికి పాల్పడినవారు పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్ అని టీడీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా వీరిద్దరూ వైకాపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రధాన అనుచరులేనని కూడా తెలిపింది. 
 
ఇందుకు సంబంధించిన ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. ఓ విద్యుత్ స్తంభం ఎక్కిన కిషోర్, కార్తీక్‌లు రాళ్లు రువ్వగా, వారికి రాళ్లు అందించేందుకు కింద నిలుచుకున్న వారు రాళ్ళతో నిండి వున్న సంచుల ఫోటోలను కూడా టీడీపీ సదరు ఫోటోల్లో చూపించింది. అంతేకాకుండా, చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి జరిగిందని టీడీపీ ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments