చంద్రబాబుపై రాళ్లదాడి చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనుచరులు

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (09:41 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన రోడ్‌షో‌లో కొందరు అగంతకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డాడు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరో టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. రాళ్లదాడి చేసింది వైకాపా ఎమ్మెల్సీ అరుణ ప్రధాన అనుచరులైన పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్‌లు గుర్తించారు. వారికి సంబంధించిన ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. రాళ్లు విసురుతున్న నిందితుల ఫోటోలను విడుదల చేసింది. 
 
తాజాగా ఈ దాడికి పాల్పడినవారు వైకాపాకు చెందినవారేనంటూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడికి పాల్పడినవారు పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్ అని టీడీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా వీరిద్దరూ వైకాపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రధాన అనుచరులేనని కూడా తెలిపింది. 
 
ఇందుకు సంబంధించిన ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. ఓ విద్యుత్ స్తంభం ఎక్కిన కిషోర్, కార్తీక్‌లు రాళ్లు రువ్వగా, వారికి రాళ్లు అందించేందుకు కింద నిలుచుకున్న వారు రాళ్ళతో నిండి వున్న సంచుల ఫోటోలను కూడా టీడీపీ సదరు ఫోటోల్లో చూపించింది. అంతేకాకుండా, చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి జరిగిందని టీడీపీ ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments