Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కర్నూల్‌కి నారా లోకేష్ - జగన్ సర్కారుపై బాబు ధ్వజం

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (12:24 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. ఆయ జిల్లాలోని పెసరవాయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ హత్యకు గురైన టీడీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి కుటుంబాలను లోకేష్ పరామర్శించనున్నారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
అంతకుముందు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సోదరులు వడ్డి నాగేశ్వర్ రెడ్డి, వడ్డి ప్రతాప్ రెడ్డిలను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. ఈ ఫ్యాక్షన్ హత్యలతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. 
 
ఈ హత్యలపై నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్ సీఎం ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్ట్ నిజరూపాన్ని బయటపెడుతున్నారని మండిపడ్డారు. 
 
ఫ్యాక్షన్ గ్యాంగులు వేటకొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లకు పదునుపెట్టి పల్లెల్లో ప్రతీకారాలకు దిగుతున్నాయని అన్నారు. టీడీపీ శ్రేణులే లక్ష్యంగా వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు చెలరేగిపోతున్నాయని లోకేశ్ దుయ్యబట్టారు.
 
పాణ్యం నియోజకవర్గంలోని టీడీపీ నేతలు నాగేశ్వరరెడ్డి, ప్రతాప్ రెడ్డిలను కారుతో ఢీకొట్టిన ఫ్యాక్షన్ లీడర్లు వేటకొడవళ్లతో నరికి చంపేయడం అత్యంత దారుణమని అన్నారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. 
 
మృతులు, బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ దారుణ మరణాలు జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతల నెత్తుటి దాహానికి సాక్ష్యమని అన్నారు.
 
ఫ్యాక్షన్ ముఠాలు ఆ ఫ్యాక్షన్‌కే అంతమవుతాయని లోకేశ్ అన్నారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పడానికి, స్నేహపూర్వక వాతావరణం కల్పించడానికి టీడీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments