Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ తొండాట...

తెలుగుదేశం పార్టీ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బురిడీ కొట్టించారు. వారితో తొండాట ఆడారు. దీంతో స్పీకర్ మహాజన్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె కార్యాలయం ఎదుట ఆందోళనకు ద

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (14:18 IST)
తెలుగుదేశం పార్టీ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బురిడీ కొట్టించారు. వారితో తొండాట ఆడారు. దీంతో స్పీకర్ మహాజన్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అసలు ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. అయితే, టీడీపీ ఎంపీలు మాత్రం లోక్‌సభలో సభలో ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి కూర్చునే కుర్చీ ముందు భైఠాయించి నిరసన తెలిపారు. కొందరు ఎంపీలైతే అక్కడే పవళించారు. 
 
ఈ విషయాన్ని లోక్‌సభ సిబ్బంది స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాను పిలుస్తున్నట్టుగా చెప్పి తీసుకునిరండి అంటూ సెక్యూరిటీ సిబ్బందికి సుమిత్రా మహాజన్ చెప్పారు. ఇదే విషయాన్ని ఎంపీలకు సెక్యూరిటీకి సిబ్బంది చెప్పడంతో ఎంపీలు సభ నుంచి బయటకు వచ్చారు. 
 
ఎంపీలు బయటకు రాగానే వెంటనే సిబ్బంది లోక్‌సభ తలుపులను మూసివేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలు రాకముందే స్పీకర్‌ సుమిత్రీమహాజన్ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. స్పీకర్ కార్యాలయ సిబ్బంది తీరుకు నిరసనగా లోక్‌సభ స్పీకర్‌ ఆఫీసు ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. అలా టీడీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ బురిడీ కొట్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments