Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అరెస్టుకు నిరసగా పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ధర్నా

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (14:12 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీలు, పార్టీ నేతలు ధర్నా చేశారు. దీనికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయకత్వం వహించారు. 
 
చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేశారంటూ వారు ఆరోపిస్తూ ధర్నా చేశారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి నారా లోకేశ్‌ హాజరయ్యారు. 
 
లోకేశ్‌తో పాటు ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌.. మాజీ ఎంపీలు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కాలవ శ్రీనివాసులు, మురళీమోహన్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, బీకే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబును అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments