Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాలు.. టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా : రైల్వే అధికారులపై రాయపాటి ఫైర్

రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (14:14 IST)
రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వే అధికారులు ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉన్నారన్నారు. 
 
తమ ప్రాంతంలోని రైల్వే సమస్యలపై ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ రాయపాటి మాట్లాడుతూ... రైల్వే అధికారులు చిన్నచిన్న పనులు కూడా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలు తమను చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. భోజనం, టిక్కెట్ కోసం సమావేశాలకు వస్తారా అని మండిపడ్డారు.
 
తాను మాట్లాడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినప్పటికీ తాను మాట్లాడుతానని చెప్పారు. రైల్వే అధికారులు ప్రధాని కన్నా పవర్ ఫుల్ అని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలుత రైల్వేజోన్ రావాల్సి ఉందని రాయపాటి అన్నారు. రైల్వే జోన్ రాకపోవడానికి అధికారులే కారణమని రాయపాటి ఆరోపించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments