Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాలు.. టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా : రైల్వే అధికారులపై రాయపాటి ఫైర్

రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (14:14 IST)
రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వే అధికారులు ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉన్నారన్నారు. 
 
తమ ప్రాంతంలోని రైల్వే సమస్యలపై ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ రాయపాటి మాట్లాడుతూ... రైల్వే అధికారులు చిన్నచిన్న పనులు కూడా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలు తమను చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. భోజనం, టిక్కెట్ కోసం సమావేశాలకు వస్తారా అని మండిపడ్డారు.
 
తాను మాట్లాడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినప్పటికీ తాను మాట్లాడుతానని చెప్పారు. రైల్వే అధికారులు ప్రధాని కన్నా పవర్ ఫుల్ అని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలుత రైల్వేజోన్ రావాల్సి ఉందని రాయపాటి అన్నారు. రైల్వే జోన్ రాకపోవడానికి అధికారులే కారణమని రాయపాటి ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments