Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా శవం కూడా చంద్రబాబుతోనే ఉంటుంది : బుద్ధా వెంకన్నా

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:54 IST)
తాను పార్టీ మారబోతున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా క్లారిటీ ఇచ్చారు. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తాను టీడీపీ అధినేత చంద్రబాబుతోనే ఉంటానని పునరుద్ఘాటించారు. వైకాపాకు చెందిన అల్లరి మూక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దుష్ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. 
 
తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై బుద్ధా వెంకన్నా స్పందిస్తూ, తనకు పార్టీ మారాలాన్న ఆలోచన ఏదీ లేదన్నారు. కొందరు కావాలనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బతికివున్నంత వరకు టీడీపీతోనే ఉంటానని, చంద్రబాబుతోనే కలిసి పని చేస్తానని చెప్పి, తన గురించి సాగుతున్న పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. 
 
కాగా, ఇటీవల విజయాడలోని ఎన్.ఏ.సి. కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా వెంకన్న ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. పైగా వేదికపైకి వెళ్లొద్దంటూ వారు వారించారు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. అంతే, ఆయన టీడీపీని వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments