Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం.. రాజీనామాలకు గంట పిలుపు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమైన విశాఖ ఉక్కు కర్మాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇవి రాష్ట్రంలో కలకలం రేపాయి. దీనిపై తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం అవుతుందనే వార్త యావత్‌ రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురిచేసిందన్నారు. 
 
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరంకాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలన్నారు. 'రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించాం. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేవని కుంటిసాకు చూపి ప్లాంట్‌ని వంద శాతం ప్రైవేటుపరం చేయడం దారుణం. 
 
ఈ విషయంలో కేంద్రం ఆలోచన సరైంది కాదు. అనేక ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్‌వోరు గనులు ఇస్తున్నందున.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ మేరకు గనులు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలి. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించాలి. అవసరమైతే ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి' అని ఈ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments