Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో టీడీపీ ఎమ్మెల్యే దంపతులు

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:35 IST)
మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటీ అనే దానిపై కూడా అందరిలో ఒక ఆందోళన కూడా ఉంది.

వ్యాక్సిన్ కచ్చితంగా భారత్ కి అవసరం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ని తయారు చేస్తుంది.
 
అయితే మూడో దశ పరిక్షల విషయంలో ఇప్పుడు కాస్త అనుమానాలు ఉన్నాయి. ఇటీవల హర్యానా మంత్రి అనీల్ విజ్ టీకా తీసుకున్నా సరే కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్లో చేరారు.

భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్ ట్రయల్ రన్ కు వాలంటీర్లుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు చేరడం గమనార్హం. ఫస్ట్ ట్రయల్ లో కోవ్యాగ్జిన్ టీకాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి గద్దె అనురాధ వేయించుకున్నారు.
 
టీకా వేయించుకున్న తర్వాత అంతా బాగానే ఉందని గద్దె రామ్మోహన్‌ దంపతులు తెలిపారు. జనవరి 4న రెండో ట్రయల్‌లో టీకా వేయించుకోనున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments