వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనంటూ సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. ఆ జాబితాలోని పేర్లు పరిశీలిస్తే, చాలా స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. అలాగే, పలువురు సిట్టింగ్లకు కూడా మళ్లీ టిక్కెట్లు కేటాయించారు. అలాగే, వివిధ కారణాల రీత్యా చనిపోయిన పార్టీ సీనియర్ నేతల తనయులకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిక్కెట్లు కేటాయించారు. ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వివరాలను పరిశీలిస్తే,
కడప అసెంబ్లీ స్థానం నుంచి అష్రాఫ్, రాయచోటిలో రమేష్ రెడ్డి, రాజంపేటలో చెంగల రాయుడు, రైల్వ కోడూరులో నరసింహ ప్రసాద్, బద్వేల్లో లాజర్, మైదుకూరులో త్వరలో టీడీపీలో చేరనున్న డీఎల్ రవీంద్రా రెడ్డి, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, పులివెందులలో సతీష్ రెడ్డి, కమలాపురంలో వీర శివారెడ్డి, తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు, రాప్తాడులో పరిటాల సునీత, పుట్టపర్తిలో పల్లె రఘనాథరెడ్డి, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, పత్తికొండవో కె.ఈ. కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్, శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర్, ఆళ్లగడ్డలో అఖిల ప్రియా రెడ్డి, నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి లేదా ఏవీ సుబ్బారెడ్డి, ఆదోనిలో మీనాక్షి నాయుడు, కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, పుంగనూరులో అనూష రెడ్డి, నగరిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు, పీలేరులో నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బొజ్జాల సుధీర్, నెల్లూరు సిటీలో పి.నారాయణ, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవూరులో పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్య, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, ఒంగోలులో దామంచర్ల జనార్దన్, దర్శిలో సిద్ధ రాఘవరావు, తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరులో నక్క ఆనంద్ బాబు, పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావులు ఉన్నారు.