Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్లే ఓటు మురిగిపోయింది.. ఎమ్మెల్యే భవానీ

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (16:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తరపున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు సంపూర్ణ మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల రామయ్య మాత్రం ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, అది చెల్లలేదు. ఆమె చేసిన చిన్న తప్పు వల్ల ఆ ఓటు మురిగిపోయింది. దీనిపై తెదేపా ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. 
 
రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో ఎలా ఓటు వేయాలో ముందే శిక్షణ ఇచ్చినా, తాను పోలింగ్ సమయంలో పొరబడ్డానని తెలిపారు. ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానని వెల్లడించారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని స్పష్టం చేశారు.
 
పైగా, రాజ్యసభ ఎన్నికల పోలింగులో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, అయితే, అక్కడున్న సిబ్బందిని టిక్ పెట్టవచ్చా అని అడిగితే వారు ఓకే చెప్పారని, దాంతో టిక్ పెట్టానని వివరించారు. 
 
ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశానని భవాని వెల్లడించారు. లోపల ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి తాను అడిగినప్పుడు తెలియదు అని చెప్పివుంటే తమ ఏజెంట్లను అడిగి సందేహ నివృత్తి చేసుకునేదాన్నని, అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను కూడా తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments