Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి గడ్డుకాలం..? కిషన్ రెడ్డితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంతనాలు

Webdunia
సోమవారం, 8 జులై 2019 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు పక్కచూపులు చూడటం టీడీపీ అధినేత చంద్రబాబును కలవరపెడుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో వంశీ ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
వల్లభనేని వంశీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు బీజేపీ, అటు వల్లభనేని వంశీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ నేత సుజనా చౌదరి ఇటీవల వల్లభనేని వంశీని బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీని వీడబోనని అప్పట్లోనే వల్లభనేని వంశీ ప్రకటించారు.
 
టీడీపీని వీడను.. వల్లభనేని వంశీ స్పందన
"నిన్న స్వర్ణభారత్ ట్రస్టులో కిషన్ రెడ్డితో ప్రతీభకు పురస్కారం అనే కార్యక్రమంలో నన్ను ఆహ్వానించారు. ఆహ్వానం మేరకే పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొనే ముందు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వెళ్లాను ఇంతకు మించి ఈ విషయంపై మాట్లాడేందుకు ఏమీ లేదు. టీడీపీని వీడే ప్రసక్తే లేదు" అన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments