Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పార్టీ ఏమైందో తెలుసుగా... పవన్ కళ్యాణ్‌ది ఉడుకు రక్తం.. టైం పట్టొచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రకు ఎంతో మేలు జరుగుతుందనీ, ప్రత్యేక హోదాతో రానివి కూడా ప్యాకేజీతో వస్తున్నాయంటూ పేర్కొన్నారు. 
 
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం అడవినాయనచెరువు సమీపంలో జరిగిన తెదేపా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయిప్రతాప్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు వచ్చారు. పవన్ ప్రత్యేక హోదాపై చేస్తున్న ప్రయత్నంపై సాయిప్రతాప్ స్పందించాలని వారు కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. పనిలోపనిగా చిరంజీవిపైనా సెటైర్లు వేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఏమైందో తెలుసుగా అంటూ చురకలు వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments