Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పార్టీ ఏమైందో తెలుసుగా... పవన్ కళ్యాణ్‌ది ఉడుకు రక్తం.. టైం పట్టొచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రకు ఎంతో మేలు జరుగుతుందనీ, ప్రత్యేక హోదాతో రానివి కూడా ప్యాకేజీతో వస్తున్నాయంటూ పేర్కొన్నారు. 
 
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం అడవినాయనచెరువు సమీపంలో జరిగిన తెదేపా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయిప్రతాప్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు వచ్చారు. పవన్ ప్రత్యేక హోదాపై చేస్తున్న ప్రయత్నంపై సాయిప్రతాప్ స్పందించాలని వారు కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. పనిలోపనిగా చిరంజీవిపైనా సెటైర్లు వేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఏమైందో తెలుసుగా అంటూ చురకలు వేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments