Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు సంసారం చేసే టైమ్ కూడా లేదు... అలా శ్రమించారు : జలీల్ ఖాన్

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (13:13 IST)
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడాన్ని ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమిపై టీడీపీ నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందిస్తూ, నవ్యాంధ్ర రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేతగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషిచేశారన్నారు. ముఖ్యంగా, ఆయన సంసారానికి కూడా సమయం కేటాయించలేక పోయారన్నారు. 
 
అలాంటి చంద్రబాబును ప్రజలు విస్మరించి ఓడించడం బాధగా ఉందన్నారు. పైగా, అతి తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు... రాష్ట్ర ప్రజల కోసం సంసారం కూడా చేయలేక పోయారన్నారు. 
 
రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, ఇతర స్వతంత్ర అభ్యర్థుల రాకవల్ల టీడీపీకి లాభం జరుగుతుందని భావించామనీ, కానీ, ఇంతలా హాని చేస్తుందని తాము గ్రహించలేకపోయామన్నారు. ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ చూడని ఓటమిని టీడీపీ ఎదుర్కోవాల్సి వచ్చిందని జలీల్ ఖాన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments