Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులోనే ఆరు గంటలు.. కారు అద్దాలు పగుల గొట్టి డోరు తెరిచి అరెస్టా..? ఏంటిది?

Webdunia
బుధవారం, 28 జులై 2021 (08:41 IST)
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు ను అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తనపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్‌ చేయాలంటూ.. తన ఫిర్యాదును తీసుకోవాలంటూ దేవినేని ఉమా జీ.కొండూరు పోలీస్‌స్టేషన్‌ వద్దకు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు తీసుకునే దాక తాను కదిలేది లేదంటూ కారులోనే కూర్చున్నారు.

సుమారు ఆరు గంటల పాటు కారులోనే కూర్చొన్నారు. అయితే.. అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయన్ను బలవంతంగా అదుపులో తీసుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి డోరు తెరిచి అదుపులో తీసుకున్నారు. అక్కడ నుంచి పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఫిర్యాదు తీసుకోకుండా అదుపులో తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన జరుగుతోందనడానికి మైలవరంలో జరిగిన ఘటన ఉదాహరణ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
 
అంతకముందు దేవినేని ఉమా వాహనంపై వైసీపీ వర్గీయులు మంగళవారం రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు.

వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. వైసీపీ నేతలను అరెస్ట్‌ చేయాలంటూ ఫిర్యాదును తీసుకోవాలంటూ దేవినేని ఉమా జీ.కొండూరు పోలీస్‌స్టేషన్‌ వద్దకు ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments