Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయ ఒప్పందంలో జగన్ హస్తం.. ఏ2 మధ్యవర్తి : అయ్యన్నపాత్రుడు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (17:40 IST)
వైజాగ్ ఉక్క కర్మాగారం ప్రైవేటీకరణ ఒప్పందంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తముందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అంతేకాకుండా, ఈ కర్మాగారారం ప్రైవేటీకరణ ఒప్పంద కంపెనీ పోస్కోకు ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య మధ్యవర్తి పలు అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడుగా ఉన్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అని ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పోస్కో కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్‌తో ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. పోస్కో కంపెనీ సీఎండీకి జగన్‌ సన్మానం చేయలేదా? అని నిలదీశారు. విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు వెళ్లారో సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 
 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు లేవంటున్నారని.. పోస్కోకు గనులు ఇక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. పోస్కోకు సీఎం జగన్‌కు మధ్యవర్తి విజయసాయిరెడ్డి కాదా? అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. వైజాగ్ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించిందనీ ఆరోపించిన ఆయన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇపుడు మాట మార్చుతోందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments