Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెగ్గిన వైసీపీ అవిశ్వాసం.... కాకినాడ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ అవుట్!

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:16 IST)
కాకినాడ  మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పై అవిశ్వాసంలో  టి.డి.పి.కి  షాక్ త‌గిలింది. రెబల్  కార్పోరేటర్లు, టి.డి.పి  మేయర్ పై కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన  అవిశ్వాసం గెలిచింది. మేయర్ పై అవిశ్వాసానికి  అనుకూలంగా 36 ఓట్లు,  అనుకూలంగా ఒక ఓటు  వచ్చాయి. అనుకున్నట్లుగానే  మేయర్  సుంకర పావని, మొదటి డిప్యూటీ మేయర్ సత్తిబాబులను పదవుల నుంచి 33 మంది  కార్పొరేటర్లు దించేశారు. దీనితో  వై.సి.పి  వ్యూహం ఫలించింది.
 
చివరి ఏడాది మేయర్ టి.డి.పి చేతిలో ఉండకూడదని వై.సి.పి. వేసిన‌ వ్యూహం  ఫలించింది.  మేయర్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 మంది చేతులెత్తారు.  మంత్రి  కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా ఓటింగ్ లో  పాల్గొన్నారు. అంతకు ముందు తిరుగుబాటు కార్పొరేటర్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో సహకార శాఖ మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత  తోడు రాగా, కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివచ్చారు. భారీ భద్రత నడుమ అవిశ్వాస తీర్మానం జరిగింది. తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది కార్పొరేటర్లు మిగిలి ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా, వారు ఎవరూ ఓటింగ్ ప్రక్రియకు రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments