Webdunia - Bharat's app for daily news and videos

Install App

OLXలో టీడీపిని అమ్మకానికి పెట్టారు... ఎమ్మెల్యే రోజా సెటైర్లు

తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీని అమ్మేందుకు OLXలో పెట్టారని రోజా ఎద్దేవా

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (07:28 IST)
తెలుగుదేశం పార్టీని వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి టార్గెట్ చేసారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీని అమ్మేందుకు OLXలో పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. అసలు తెదేపా ఎక్కడుందీ అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఖాళీ అయిపోయిందనీ, ఆ షాక్ నుంచి తప్పించుకునేందుకు ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలకు ఆశలు చూపి వలవేసి లాగేస్తున్నారని విమర్శించారు. అసలు ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ లేదని ఆమె చెప్పుకొచ్చారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నది వివిధ పార్టీల సమూహమనీ, అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 30 మంది ఉంటే, భాజపా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను లాగడంతో వారు కూడా అందులో భాగస్వామ్యమయ్యారన్నట్లు ఆమె కామెంట్లు ఉన్నాయి. మొత్తమ్మీద వివిధ పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో పాలన సాగిస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments