Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసు : మాజీ మంత్రి నారాయణకు ఊరట

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:33 IST)
అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు చేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు గతంలో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను మరో రెండు వారాల పాటు పొడగించింది. ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్‌లో ఉన్నారు. ఈ బెయిల్‌ను పొడగించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. దీంతో మరో రెండు వారాల పాటు బెయిల్ పొడగిస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబి, నారాయణ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ రెండు వారాల పాటు ముందస్తు బెయిల్ పొడగించింది. జాబితాతో పాటు నారాయణ సంస్థల ఉద్యోగులకు ఆయనకు బినామీలుగా అసైన్డ్ భూములను రైతులను బెదిరించి కొనుగోలు చేశారని ఏపీసీఐడీ పోలీసుల కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భూముల విలువ పెరగడంతో వీరు ఆయాచిత లబ్ది పొందారని ఆరోపించారు. ఈ కేసులోనే మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను మరో రెండు వారాల పాటు పొడగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments