Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాలు ఇవ్వలేని ఈ దద్దమ్మ జగన్ మూడు రాజధానులు నిర్మిస్తాడా? : చంద్రబాబు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (09:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు పునరుద్ఘాటించారు. ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోమారు నవ్యాంధ్రకు ఒకే ఒక్క రాజధాని ఉండాలంటూ తేల్చి చెప్పారు. విశాఖపట్టణంను ఆర్థిక, పర్యాటక కేంద్రా మారాలని ఆయన అభిలషించారు. 
 
విజయనగరం జిల్లా బొబ్బిలిలో చంద్రబాబు శుక్రవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. అమరావతిలో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు.
 
ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని ఈ దద్దమ్మ జగన్ మూడు రాజధానులు నిర్మిస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్‌వి అన్నీ సన్నాసి మాటలన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ పేరతో యువతని మోసంగించారని మండిపడ్డారు. 
 
జగన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని వ్యాఖ్యానించారు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా చితికిపోయారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అట్టడుగు స్థాయికి జగన్ రెడ్డి దిగజార్చాడన్నారు.
 
తాము గతంలో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచామని, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. నాయకత్వం కోసం మహిళలు పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments